షాబాద్, జనవరి 3: షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. షాబాద్కు చెందిన దివ్యాంగ బాలుడు రాజు(03)ఆరోగ్య పరిస్థితిపై చలించిపోయారు. పుట్టుకతోనే తలలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల రాజుకు మెరుగైన వైద్యం అందించేందుకు అవినాశ్రెడ్డికి ముం దుకు వచ్చారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో గిఫ్ట్ ఏ స్మైల్ కింద రాజుకు వైద్యం కోసం తనవంతుగా రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. షాబాద్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద, దళిత దంపతులు నవనీత-సామ్యూల్లకు మూడేళ్ల క్రితం రాజు జన్మించాడు.
పుట్టుకతోనే తలలో ఎముకలు కలిసిన పరిస్థితులతో అనారోగ్యంతో సతమతమవుతున్నాడు. కొద్దిపాటి డబ్బులు అప్పు చేసి కొడుకును దవాఖానలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. మంగళవారం జడ్పీటీసీ అవినాశ్రెడ్డిని కలిసి రాజు పరిస్థితిని వివరించారు. వెంటనే జడ్పీటీసీ రూ.లక్ష అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షుడు రాందేవ్యాదవ్ తదితరులు ఉన్నారు.