షాబాద్ : జిల్లా వ్యాప్తంగా పశువులకు వేసే గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డిజిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అంజిలప్ప అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని మద్దూర్, సోలీపేట్ గ్రామాల్లో జరిగే టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3.69లక్షల ఆవులు, గెదేలకు నెల రోజుల పాటు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాల ద్వారా పశువులకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.
రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఆయన వెంట స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, సర్పంచులు రమ్యరాంచంద్రారెడ్డి, నరేందర్రెడ్డి, వైద్యసిబ్బంది శ్రీనివాస్, సాగర్, కృష్ణామూర్తి, రైతులు పాల్గొన్నారు.