వికారాబాద్, మార్చి 20 : రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ను వర్తింపజేయడం చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్ప్ ఉద్యోగుల తో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సెర్ప్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
కొడంగల్, మార్చి 20 : సెర్ప్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. పేస్కేల్ ప్రకారం వారికి వేతనా లను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని హర్షిస్తూ సెర్ప్ ఉద్యోగులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా పలువురు సెర్ప్ ఉద్యోగులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మా కష్టాలను గుర్తించి.. మాకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతోపాటు నియోజకవర్గంలోని సెర్ప్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సంక్షేమానికి కృషి
మొయినాబాద్, మార్చి 20 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం పేస్కేల్ వర్తింపజేయడాన్ని హర్షిస్తూ సెర్ప్ ఉద్యోగులు మండల పరిషత్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ను వర్తింప జేస్తూ జీవోను జారీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నా రు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, ఎంపీడీవో సంధ్య, ఏపీఎం రవీందర్, షాబాద్ ఏపీఎం నర్సింహులు, నవాబుపేట ఏపీఎం మంజులావాణి, సీసీలు జంగయ్య, నిర్మల, జంగయ్య, రమేశ్, మల్లేశ్, మంజుల, సాగర్, షబ్బీర్, ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆమనగల్లులో..
ఆమనగల్లు, మార్చి 20 : పే స్కేల్ వర్తింపజేయడాన్ని హర్షిస్తూ సోమవారం ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాలకు చెందిన సెర్ప్ ఉద్యోగులు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సెర్ప్ ఉద్యోగులు స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాకిబండతండా సమీపంలో ఉన్న మైనింగ్ను ఎత్తివేయాలని పలువురు తండాకు చెందిన యువకులు ఎమ్మెల్యే కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, ఎంపీటీసీ కుమార్, నిట్టనారాయణ, ఏఎంసీ డైరెక్టర్లు సుభాశ్, రమేశ్నాయక్, అల్లాజీ, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఖలీల్, కిరణ్, ఆంజనేయులు, రాజేశ్వరి, మహేందర్, రాంచంద్రయ్య, కృష్ణ, పోచయ్య పాల్గొన్నారు.