మన రాష్ట్రాన్ని అత్యుత్తమంగా నిలిపిన సీఎం కేసీఆర్ కార్యదక్షతతో దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కు హెల్త్కార్డులు అందజేయడం వల్ల వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఉద్యోగుల మాదిరిగానే రూ.2లక్షల వరకు వైద్యం పొందే సదుపాయం తమకు మేలు చేసిందని చెబుతున్నారు. ఇలాంటి సదుపాయాలు దేశమంతా రావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని వారు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చూపిస్తున్న వివక్ష సరైంది కాదంటున్నారు. అన్ని రంగాల్లో చేపట్టిన అభివృద్ధి, దేశంలో మిగతా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మన రాష్ట్ర ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేశాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి సమయంలో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడి అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/పరిగి, సెప్టెంబర్ 13 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై అన్ని వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తున్నది. దేశానికి సమర్థ నాయకత్వం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని జిల్లాలోని రిటైర్డ్ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ కీలకంగా మారాలని ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగులకు ఇతర రాష్ర్టాల్లో ఎక్కడాలేని విధంగా సౌకర్యాలను కల్పిస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పింఛన్తోపాటు డీఆర్, మెడికల్ అలవెన్స్ తదితరాలను ప్రభుత్వం కల్పిస్తుండడం గమనార్హం. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 8350 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. ఎనిమిదేండ్లలోనే మిగతా రాష్ర్టాలన్నీ ఆదర్శంగా తీసుకునేలా తెలంగాణను అభివృద్ధి చేశారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ వంటి పథకాలను దేశమంతటా అమలు చేయాలంటే సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలంటున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల సంపూర్ణ మద్దతు..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని రిటైర్డ్ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అతి తక్కువ సమయంలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ కార్యదక్షతతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లాలో సుమారు 4300 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్కార్డులు అందజేయడం సంతోషకరమన్నారు. రూ.2లక్షల వరకు వైద్యం పొందే సదుపాయం కల్పించి ప్రభుత్వం మేలు చేసిందని చెబుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పలు విధానాలు దేశ వ్యాప్తంగా అమలు జరుగాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని వారు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలపై చూపిస్తున్న వివక్ష సరైంది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అన్ని రాష్ర్టాలను ఒకేలా చూడాల్సింది పోయి కేవలం బీజేపీ పాలిత రాష్ర్టాలను ఒకలా, ఇతర రాష్ర్టాలను మరోలా చూడడం సరికాదన్నారు. తెలంగాణలో ఎలాంటి రాజకీయ వివక్ష చూపకుండా నిధుల విడుదల, సంక్షేమ పథకాల అమలు జరుగుతుండగా ఇందుకు విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. రాష్ర్టాలు తీసుకునే అప్పుల విషయంలో ఒకలా, కేంద్రం తీసుకునే అప్పుల విషయలో మరోలా వ్యవహరించడం తగదని చెబుతున్నారు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వంటి విజన్ గల నాయకుడు రావడం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు.
మన పథకాల వైపు.. దేశం చూపు
మన రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కేసీఆర్ ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలైతే మన దేశం మరింత పురోగతి సాధిస్తుంది. మన సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసే సత్తా కేసీఆర్కు ఉన్నది. ఆయన జాతీయ రాజకీయాల్లో రాణించాలి. మన దేశం బాగుపడాలంటే కేసీఆర్తోనే సాధ్యం. ఇక్కడ విశ్రాంత ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు దేశమంతా అమల్లోకి రావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే.. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్కు మద్దతు పలుకాలి. – రాములు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, షాద్నగర్
మత రాజకీయాలకు చెక్ పడుతది…
సీఎం కేసీఆర్ రాజకీయాల్లోకి వస్తే కుల, మత రాజకీయాలు చేస్తున్న పార్టీలకు చెక్ పడుతది. సంక్షేమ పథకాలు దేశమంతటా అమలైతయ్. కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు దేశవ్యాప్తంగా వెలిసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానున్నది.
– డి.వెంకటయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు, కొడంగల్
దేశం అభివృద్ధి చెందుతది..
సీఎం దేశ రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపడితే దేశం అభివృద్ధి చెందుతది. దేశ రాజకీయ చరిత్రలో ఎంతో మంది మహానేతలు పాలించినా కేసీఆర్ వంటి నేతలు వస్తే మరింత ఉత్తమ పరిపాలన అందుతుంది. తెలంగాణ పథకాలను ఇతర రాష్ర్టాలవారు ఆదర్శంగా తీసుకుంటున్నారు. దేశాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం ఎంతో అవసరం.
– జయానందం, రిటైర్డ్ టీచర్, బార్వాద్ గ్రామం
బంగారు భారత్గా మారుతది..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే బంగారు భారత్గా మారుతది. బీజేపీ కుట్రలను తిప్పికొట్టే సత్తా కేవలం సీఎం కేసీఆర్కే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం కావాలి. పొరుగు రాష్ర్టాల ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసిస్తున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయల్లోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
– నర్సింలు, రిటైర్డ్ డీపీఆర్వో, రాఘవాపూర్, పరిగి మండలం
సంక్షేమ పథకాలకు ఆద్యుడు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి సంక్షేమ పథకాల ఆద్యుడిగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చారు. ప్రజలు అవకాశం ఇస్తే దేశాన్ని కూడా తెలంగాణలాగే తీర్చిదిద్ది ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడుతారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉండే సీఎం కేసీఆర్ వంటి నాయకుడు ప్రస్తుత పరిస్థితులలో దేశానికి అవసరం.
– కంబాలపల్లి సత్తయ్య, రిటైర్డ్ హెచ్ఎం, ఆమనగల్లు
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళితే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఉద్యోగులకు మంచి వేతనాలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది.
– రాంచంద్రారెడ్డి, రిటైర్డ్ పోలీసు, షాబాద్ మండలం
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలె..
తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలె. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలె. దేశంలో విద్యా రంగం మెరుగుపడాలె. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– బలరాం, రిటైర్డ్ వెటర్నరీ ఉద్యోగి (ఇబ్రహీంపట్నం)
బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి సీఎం కేసీఆరే..
కేంద్రంలోని బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి సీఎం కేసీఆరే. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక ఫ్రంట్ను ఏర్పాటు చేసే శక్తి కేసీఆర్కే ఉన్నది. ఎనిమిదేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ పథకాలను దేశంలో అమలు చేస్తే పేదలకు ఎంతో న్యాయం జరుగుతది.
– శేఖర్రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి (ఇబ్రహీంపట్నం)
జాతీయ రాజకీయాల్లోకి రావాలి..
మోదీ ప్రభుత్వం మాత్రం కేవలం దేశ సంపదను అదానీ వంటి ఒకరిద్దరికి దోచిపెడుతున్నది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశ రూపురేఖలు తక్కువ సమయంలో మారుతాయి. అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగులకు మేలు జరిగింది. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి.
– బచ్చంగారి భుజంగరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి, చేవెళ్ల
సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ వంటి గొప్ప నాయకుల సేవలు దేశానికి అవసరం. దేశం ఆర్థికంగా వెనుకబడి ఉన్నది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నా అది కేసీఆర్కే సాధ్యం. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో వినూత్న మార్పులు వచ్చాయి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తాడనే నమ్మకం ఉన్నది.
– కమ్మరి సింహయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
పేదల బతుకులు మారుతయ్..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే పేదల బతుకులు మారుతయ్. పేదల కష్టాలు తెలిసిన నేత కేసీఆర్. వారి జీవితాల ఆధారంగానే పథకాలకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న పథకాలు పేద ప్రజల జీవితాలను మార్చుతున్నాయి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
– హన్మంత్రెడ్డి, రిటైర్డ్ వీఆర్వో బషీరాబాద్
ఇది సరైన సమయం..
ప్రస్తుతం దేశానికి సీఎం కేసీఆర్ అవసరం చాలా ఉన్నది. దేశ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం. జాతీయస్థాయిలో ముఖ్య భూమిక పోషించి తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశంలో అమలు చేస్తే సబ్బండ వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రజల కష్టాలు తెలిసిన నేత దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం.
– పురుషోత్తంరెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం కొర్విచేడ్