చెన్నై : తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్ అడుగుపెట్టబోతున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే రాజకీయాల్లో ప్రవేశించడంపై ధనుష్ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల ఆయన ఒక చిత్ర వేడుకలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ఐక్యత కేవలం సినిమా వేడుకలకు మాత్రమే పరిమితం కాకూడదని, ఎవరి ప్రాంతాల్లో వారు ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.
తన 43వ పుట్టినరోజు సందర్భంగా ధనుష్ నిరుపేదలకు ఉచితంగా ఆటో రిక్షాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, అభిమానులను కలుసుకోవడంతోపాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం కావాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం.