ఇబ్రహీంపట్నంరూరల్ : స్వయం కృషితో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని భువనగిరి మాజీ ఎంపీ భూర నర్సయ్యగౌడ్ అన్నారు. మండల పరిధిలోని రాయపోల్లో టీఆర్ఎస్ నాయకులు గంగనమోని సతీష్ముదిరాజ్ ఏర్పాటు చేసిన నూతన రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రాయపోల్ సర్పంచ్ బల్వంత్రెడ్డి, ఎంపీటీసీ శ్రీశైలం, టీఆర్ఎస్ నాయకులు జగదీశ్యాదవ్, డబ్బికార్ శ్రీనివాస్, పాశం అశోక్గడ్, బాలరాజు, ఈశ్వర్, విష్ణు, నాగరాజు, వెంకటాచారి తదితరులు ఉన్నారు.