సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్లోని మౌలాలి జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (జెడ్ఆర్టీసీ)లో ఉన్న 200 ఏళ్ల నాటి వారసత్వ దిగుడు భావిని సుమారు రూ.6 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు. ఈ సందర్భంగా మెట్ల బావిని రంగులు, లైటింగ్స్తో సుందరంగా అలంకరించారు.