షాబాద్, జనవరి 11 : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఆరు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు (ఈ నెల 12వ తేదీ నుంచి 17 వరకు) ప్రకటించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు బ్యాగులు సర్దుకుని తమ ఇండ్లకు వెళ్తున్నారు.
కొంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ సెలవు ల్లో పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ముందస్తుగానే ప్రణాళికను వేసుకున్నారు. దూర ప్రాంతాల పర్యటనలు జీవితంలో మధుర ఘట్టాలుగా మిగిలిపోతాయి. అందులోనూ గ్రూపులుగా వెళ్తే ప్రతిచోటా సందడే. అటువంటి ప్రయాణాలు విషాదయాత్రలుగా మారకుండా ఉండాలంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
చక్కటి ప్లానింగ్తో వెళ్తే ప్రయాణాలు ఎంతో సంతోషంగా ఉంటాయి. పర్యటనలో చూసే ప్రదేశాల గురించి ముందుగానే అవగాహన పెంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఒకే రూట్లో ఉన్న ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలి. పర్యటించే ప్రదేశాల్లో వాతావరణ పరిస్థితి, గైడ్, భోజనం, తదితర వివరాలను తెలుసుకోవాలి. వెబ్సైట్ల ద్వారా కూడా మనం పర్యటించే ప్రదేశాల వివరాలను తెలుసుకోవచ్చు.