వికారాబాద్ : ప్రతి సంవత్సరం జనవరి మాసంలో సాంప్రదాయ బద్ధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండు సందర్భంగా శుక్రవారం వికారాబాద్ పట్టణ ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. బోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. బోగి పండుగ సందర్భంగా మహిళలు ఇండ్ల ముందు ముగ్గులు వేశారు. ఆ ముగ్గులకు రంగులు అద్ది అందంగా అలంకరించి పండుగను జరుపుకున్నారు.
పలువురు మహిళా రైతులు రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి అని నాగలి ఎత్తిను చూపే విధంగా ముగ్గులు వేశారు. పిండి వంటకాలు తయారు చేసుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కలిసి ఆరగించారు. చిన్నారులు గాలి పటాలను ఎగరవేస్తూ ఆనందంగా గడిపారు.