ఎల్బీనగర్ : రైతుల పట్ల అభిమానంతోనే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేట డివిజన్ మోహన్నగర్ ప్రజయ్నివాస్ ఫేజ్ 2లో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ రైతుబంధుపై ఉన్న అభిమానంతో సంక్రాంతి ముగ్గుల్లో మహిళలు అందమైన ముగ్గులు వేస్తున్నారని అన్నారు.
అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలని, కొవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. పండుగలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులతో వీధులన్నీ సుందరంగా మారాయి.
కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు దేవిరెడ్డి శ్వేతారెడ్డి వేసిన రైతుబంధు ముగ్గు అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్గౌడ్, శరీన్, కొత్త తిరుమల్, సత్యనారాయణతో పాటుగా పలువురు పాల్గొన్నారు.