కొడంగల్/బొంరాస్పేట, డిసెంబర్ 16 : కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో రహదారులు లేని గిరిజనతండాలకు ప్రభుత్వం బీటీ రోడ్లు మంజూరు చేసింది. నియోజకవర్గంలో అత్య ధికంగా ఉన్న గిరిజనతండాల అభివృద్ధికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో అనేక తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. తండాల్లో మౌలిక వసతులు కల్పించడానికి నిధులు మంజూరు చేయిస్తున్నారు. తండా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, మురుగు కాల్వ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. తాజాగా రోడ్లు లేని తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయాలని, గతంలో నిర్మించిన బీటీ రోడ్లు, వంతెనలు వర్షాలకు దెబ్బతిన్నందున వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించి నిధులు మంజూరు చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మూడు మండ లాల్లోని తండాలకు కొత్తగా బీటీ రోడ్లు నిర్మించడానికి రూ.18.20 కోట్లు మంజూరుకాగా, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.6.40 కోట్లు మంజూరయ్యాయి. చాలా ఏం డ్ల నుంచి అధ్వాన్నంగా మారి రాకపోకలకు కష్టంగా ఉన్న కొత్తూరు-దేవనూరు రోడ్డు కు నిధులు మంజూరు కావడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన బీటీ రోడ్లు
గిరిజన సంక్షేమశాఖ ద్వారా బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లోని గిరిజనతండాలకు కొత్తగా బీటీ రోడ్లు నిర్మించడానికి రూ.18.20 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో బొంరాస్పేట మండలంలోని బురాన్పూర్ నుంచి చెరువు ముందలితండాకు 1.50 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.53 లక్షలు, ఈర్లపల్లి నుంచి వా యిల్లగడ్డతండాకు 0.70 కి.మీ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.88 లక్షలు, చిల్ ముల్మైలారం నుంచి ఎక్కచెరువుతండా వరకు 2.50 కి.మీ బీటీ రోడ్డుకు రూ.1.50 కోట్లు, ఆర్ అండ్ం బీ రోడ్డు నుంచి సంట్రకుంటతండా వరకు 2.50 కి.మీ బీటీ రోడ్డుకు రూ.1.63 కోట్లు, లోతుకుంటతండా నుంచి బొంరాస్పేటకు 2 కి.మీ బీటీ రోడ్డుకు రూ.1.30 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్ మండలంలో పోచమ్మతండా నుంచి మైసమ్మతండా వరకు 2.30 కి.మీ బీటీ రోడ్డుకు రూ.1.50 కోట్లు, అప్పాయిపల్లి నుంచి ఆశమ్మకుంటతండా వరకు 2 కి.మీ బీటీ రోడ్డుకు రూ.1.30 కోట్లు, పలుగురాళ్లతండా నుంచి ఎక్కచెరువుతండా వరకు 3.10 కి.మీ బీటీ రోడ్డుకు రూ.1.55 కోట్లు మంజూ రయ్యాయి. దౌల్తాబాద్ మండలంలో యాంకి నుంచి గనెర్లకుంటతండాకు 1 కి.మీ బీటీ రోడ్డుకు రూ.58 లక్షలు, గోకాఫస్లాబాద్ నుంచి బోడమర్రిగడ్డతండాకు 2 కి.మీ బీటీ రోడ్డుకు రూ.53 లక్షలు, రావులపల్లి నుంచి కుప్పగిరి, చంద్రకల్ మీదుగా బిచ్చాల్కు 7 కి.మీ బీటీ రోడ్డుకు రూ.4.55 కోట్లు, హన్మ్యానాయక్తండా నుంచి అల్లాపూర్తండా వరకు 3 కి.మీ బీటీ రోడ్డుకు రూ.1.95 కోట్లు, సెవ్యాబండతండా నుంచి పోల్కంపల్లి వరకు 0.60 కి.మీ బీటీ రోడ్డుకు రూ.39 లక్షలు నిలలు మంజూరయ్యాయి.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.6.40 కోట్లు మంజూరు
నియోజకవర్గంలోని మూడు మండలాలల్లో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతులకు రూ.6.40 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో బొంరాస్పేట మండలంలోని మెట్లకుంట నుంచి పీడబ్ల్యుడీ రోడ్డుకు రూ.60 లక్షలు, మూడుమామిళ్ల తండా నుంచి దీప్లానాయక్తండా వరకు రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు, కొత్తూరు నుంచి దేవనూరు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.10 కోట్లు, కొడంగల్ మండలం చిట్లపల్లి-ఖాజాఅహ్మద్పల్లి మధ్యన నిర్మించిన వంతెనకు రూ.40 లక్షలు, దౌల్తాబాద్ మండలంలో సుల్తాన్పూర్ నుంచి పీడబ్ల్యుడీ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.90 కోటు మంజూరయ్యాయి. ఈ పనులకు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారు.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
ప్రతి గ్రామ, తండాకు రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో రోడ్డు ఎరుగని ఎన్నో గ్రామ, తండాలకు బీటీ రోడ్లు మంజూరై నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మిగిలిన ఆయా గ్రామ, తండాలకు రూ.32.43కోట్లుతో 52.7 కిలో మీటర్ల మేరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. త్వరలో టెండర్ ప్రక్రియతో పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.
– పట్నం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే, కొడంగల్
చాలా సంతోషంగా ఉంది..
పోచమ్మతండా- మైసమ్మ తండా దారి మధ్యలో వాగు ఉండగా, వాగుపై వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వ ర్యంలోరూ.50లక్షలు మంజూరు చేయించడం జరిగింది. ప్రస్తుతం పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మైసమ్మతండా వరకు బీటీ రోడ్డుకు నిధులు మంజూరు కావడంతో చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేకు ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెపుకొంటున్నాము.
– శంకర్నాయక్, సర్పంచ్, పోచమ్మతండా, కొడంగల్