కొత్తూరు, డిసెంబర్ 6: విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.10.89 కోట్లు మంజూరయ్యని ఎంపీపీ పన్నింటి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని చెప్పారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు. వివిధ గ్రామాల సర్పంచ్లు విద్యుత్ సమస్యలను ప్రస్తావించారని, నూతన ట్రాన్స్ఫార్మర్లు, అదనపు విద్యుత్ లైన్ల కోసం 10.89 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు.
ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలన్నింటిని తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శోభలింగంనాయక్, ఎంపీడీవో శరత్చంద్రబాబు, తహసీల్దార్ రాములు ఎంపీటీసీలు అంజమ్మ, ఇందూరు సత్తమ్మ, ఐసీడీఎస్ సీటీపీవో భాగ్యమ్మ, ఎంపీవో నరసింహులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బీమా.. రైతు కుటుంబానికి ధీమా
రైతు బీమా మృతిచెందని రైతు కుంటుబానికి ధీమా ఇస్తుందని ఎంపీపీ మధుసూదర్రెడ్డి అన్నారు. కొత్తూరు మండలంలోని వివిధ కారణాల వల్ల మృతి చెందిన మంది రైతులకు రూ. 30 లక్షల విలువ చేసే చెక్కులను మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు. మల్లాపూర్కు చెందని కుమ్మరి సుజాత, సిద్ధాపూర్-సబావత్ హీర్యా, పాత్లావత్ లక్షణ్, కొడిచెర్ల-సబావత్ తౌర్య, ఇన్ముల్నర్వ-కొర్ర సుశీల, పాత్లావత్ శ్రీను అనే రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరందరికి నామినీగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున చెక్కులను ఎంపీపీ అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపాల్, ఏఈవో అనిత దీపిక, రైతులు, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.