వికారాబాద్, జనవరి 25 : బీఎల్వోలు, బీఎల్ఏల సహకారంతో తప్పుల్లేని.. పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించాలని రోల్ అబ్జర్వర్ జ్యోతీబుద్ధ ప్రకాశ్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ఓటరు జాబి తా రూపకల్పనపై అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా ఎంతో ముఖ్యమన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకుల సహకారంతో బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని, వారి సహకారంతో బీఎల్వోల ద్వారా పక్కాగా ఓటరు జాబితాను రూపొందించాలని సూచించారు.
డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన వారిని గుర్తించి జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రతి బీఎల్వో తన వద్ద ఫామ్-6, 7, 8 అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తన వద్ద ఉన్న ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓటర్లు, చనిపోయిన వారు లేనట్లు ప్రతి పేజీపై సంతకం చేయాలన్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న అధికారులు, వివి ధ పార్టీల ప్రతినిధులు, బీఎల్వోలతో ఓటరు జాబితా రూపకల్పనలో మార్పులు, చేర్పులు తదితర అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా లో ఓటరు ప్రక్రియ చాలా బా గుందని ఆయన కితాబు ఇచ్చారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించనున్న సందర్భంగా అవసరమైన మార్పులు, చేర్పు లు, సవరణలు తొలగింపులు అన్నింటిని ఈ నెల వర కు పూర్తి చేసి పారదర్శకమైన ఓటరు జాబితాను రూ పొందిస్తామన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో ని అన్ని కళాశాలల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి యువతీయువకులందరినీ ఓటరుగా నమోదు చేశామని గుర్తు చేశారు. సమ్మర్ స్పెషల్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెలలోపు పరిష్కరించి, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు స్పష్టమైన ఓట రు జాబితాను రూపొందిస్తామన్నారు. సమావేశంలో వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు నియో జకవర్గాల రిటర్నింగ్ అధికారులు రాహుల్శర్మ, లింగ్యానాయక్, విజయకుమారి, శ్రీనివాసరావుతో పాటు నియోజకవర్గాల ఏఈఆర్వోలు, వివిధ పార్టీల ప్రతినిధులు, బీఎల్వోలు పాల్గొన్నారు.