ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతులు ప్రధానంగా పండించే పంట వరి. వరి పండించడంలో రైతులకు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ మితిమీరిన తెగులు సోకడంతో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తున్నది. నారుమడి వేసిన నాటి నుంచి కోత కోసే వరకు మందులు పిచికారీ చేయాల్సి వస్తున్నది. ముందస్తుగానే రైతులు నారుమడి సాగులో తగు జాగ్రత్తలు తీసుకుంటే తెగుళ్ల బారినుంచి తప్పించుకునే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
– న్యూస్ నెట్వర్క్
ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నారుమడుల్లో సాయంత్రం వేసిన నీటిని ఉదయం తొలగించాలి. చలి తీవ్రత నుంచి నారుమడిని కాపాడుకోవడానికి శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుంటే మంచిది. నారుమడికి కావాల్సిన వెచ్చదనం అందించే ఎరువులను వాడుకుంటే ఫలితం ఉంటుంది.
– డా.స్వప్న, కేవీకే శాస్త్రవేత్త