షాబాద్, జూన్ 8 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందడంతో మార్పు వచ్చిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం షాబాద్లోని పహిల్వాన్ చెరువు కట్టపై నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ హరీశ్, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో షాబాద్ నుంచి మహిళలు ర్యాలీగా బతుకమ్మలు, బోనాలు తీసుకుని చెరువు కట్టపైకి వచ్చారు. కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ దూరదృష్టి, లీడర్ షిప్ క్వాలిటీ, వారు చేసిన కృషితో నేడు వ్యవసాయం సస్యశ్యామలం అయిందన్నారు.
ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ…అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ…మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ… దశాబ్ది ఉత్సవాల్లో ఏ రంగమైన ముందంజలో ఉన్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మిరాజేందర్గౌడ్, చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్రావు, ఎంపీడీవో అనురాధ, తహసీల్దార్ సైదులుగౌడ్, ఎంపీవో హన్మంత్రెడ్డి, ఇరిగేషన్ సీఈ ధర్మ, ఎస్ఈ రంగారెడ్డి, డీఈఈ వెంకటరమణ, ఈఈ రేణుకాదేవి, ఏఈ సురేశ్, వర్క్ ఇన్స్పెక్టర్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, కార్యదర్శి శ్రీరాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, గ్రామ సర్పంచ్ తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, షాబాద్ మాజీ సర్పంచ్ కల్వకోల్ వెంకట్యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు కేతన, దర్శన్, జంగయ్య, రమ్య, నాయకులు రమేశ్యాదవ్, సుదర్శన్, వెంకటయ్య, రాజేందర్రెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం : గతంలో కరువుతో కొట్టుమిట్టాడిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరువతో కరవును జయించామని, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం చెరువుల పండుగ సందర్భంగా ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వద్ద, యాచారం మండలంలోని చింతపట్ల లక్ష్మణచెరువు వద్ద ఏర్పాటుచేసిన చెరువు పండుగలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీలు కృపేశ్, సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, ఆర్డీవో వెంకటాచారి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ఛైర్మన్ యాదగిరి, సర్పుంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్గౌడ్, కౌన్సిలర్లు జగన్, బాలరాజు, మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, ఎంపీడీవో క్రాంతికిరణ్, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేవ్, పాశ్చ బాష, తలారి మల్లేశ్, గోవర్ధన్రెడ్డి, రవీందర్, ముత్యాల చిన్న, రాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరర్లో..
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని రాయపోల్, దండుమైలారం, పోల్కంపల్లి, నాగన్పల్లి, కప్పాడు, ఎలిమినేడు, తుర్కగూడలో చెరువు పండుగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బోనాలను అమ్మవార్లకు సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, సర్పంచులు గీతారాంరెడ్డి, బల్వంత్రెడ్డి, ఎంపీడీవో క్రాంతికిరణ్, ఎంపీటీసీ ఆంజనేయులు, ఎంపీటీసీలు శ్రీశైలం, జ్యోతి పాల్గొన్నారు.
యాచారంలో…
యాచారం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతోనే గ్రామీణ ప్రాంత చెరువులకు పూర్వ వైభవం సంతరించుకున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని చింతపట్లలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఊరూ రా చెరువుల పండుగ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి కట్ట మైసమ్మకు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం వాలీబాల్ క్రీడా పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేత టీమ్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన చింతపట్లకు చెందిన శివానిని ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, సర్పంచ్లు సరిత, జగదీశ్, హబీబుద్దీన్, ఎంపీటీసీ లక్ష్మమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశ్, తహసీల్దార్ సుచరిత, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ ఉమారాణి, పీఏసీఎస్ డైరెక్టర్ స్వరూప, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాచ్చ భాష, నాయకులు వెంకటయ్య, గోవర్ధన్రెడ్డి, నర్సింహారెడ్డి, ఖాజా, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేటలో..
పెద్దఅంబర్పేట : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పెద్దఅంబర్పేటలోని ఈదుల చెరువు వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. చైర్పర్సన్ స్వప్న బోనంతో చెరువు వద్దకు వెళ్లారు. కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ సిబ్బంది డప్పు వాయిద్యాల నడుమ చెరువు కట్టపై ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, గీత తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్లో..
మొయినాబాద్ : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చెరువు పండుగ గ్రామాల్లో కన్నుల పండువగా జరిగింది. చిలుకూరులో పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచులు స్వరూప, లావణ్య, శ్రీనివాస్, రత్నం, ఎంపీడీవో సంధ్య, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, ఏవో రాగమ్మ, ఆర్ఐలు పాండు, చంద్రమౌలి, పీఎం రవీందర్, ఇరిగేషన్ డీఈ పరమేశ్వర్, ఏఈ లక్ష్మి, వర్క్ ఇన్స్సెక్టర్ నర్సిములు, ఎంపీటీసీలు శ్రీనివాస్, అర్జున్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జయవంత్, అంజిరెడ్డి, ఆండ్రూ, మల్లేశ్, నర్సింహాగౌడ్, భాస్కర్చారి, రాంచంద్రయ్య, భద్రప్ప, భాస్కర్, యాదగిరచారి, రాఘవేందర్యాదవ్, రమేష్,తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లిలో..
శంకర్పల్లి : మండలంలోని చెరువుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, పీడీ ప్రభాకర్, సర్పంచులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్, అశ్విని సుధాకర్, ఏఎంసీ చైర్మన్ పాపారావు, ఎంపీటీసీలు ప్రవళిక, తహసీల్దార్ నయీముద్దీన్, ఎంపీడీవో వెంకయ్య, గీత, నాగభూగణం తదితరులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్లో..
తుర్కయాంజాల్ : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో చెరువుల పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. బ్రాహ్మణపల్లిలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా వచ్చి, వాటిని సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లేశ్, మంగమ్మ, అయిలయ్య, సంగీత, శ్రీలత, కమిషనర్ సాబేర్ అలీ, టౌన్ ప్లానీంగ్ అధికారి దేవానంద్, డీఈ సత్యనారాయణ, ఏఈ గుణాకర్, స్థానిక నాయకులు కొంతం వెంకట్రెడ్డి, చిన్నయ్య, మోహన్గుప్త పాల్గ్గొన్నారు.
కొంగరకలాన్లో..
ఆదిబట్ల : మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్లో దాతారు చెరువు వద్ద చెరువు పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరేందర్రెడ్డి, కౌన్సిలర్లు వనం శ్రీను,జి మహేందర్, దాసు, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు జంగయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంచాలలో..
మంచాల : మండలంలోని ఆరుట్ల, లింగంపల్లి, లోయపల్లి తదితర గ్రామాల్లో చెరువుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. చెరువుల పండుగలో సర్పంచ్లు విష్ణు వర్ధన్రెడ్డి, హరిప్రసాద్, అనిత, వినోద, బాల్రాజ్ ఎంపీటీసీలు రమేశ్, సదానందం, తహసీల్దార్ అనిత, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లలో..
చేవెళ్లటౌన్ : మండలంలో చెరువుల పండుగ ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. బతుకమ్మలు, బోనాలతో ర్యాలీ తీసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాలతీరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్కుమార్, ఆర్ఐ రాజేష్, చేవెళ్ల డివిజన్ అటవీ శాఖ అధికారిణి ప్రతిమ, ఎంపీవో విఠలేశ్వర్జీ, ఎపీఎం శోభారాణి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్లు శైలజ, నరహరి రెడ్డి, జహంగీర్, గ్రామ కార్యదర్శులు వెంకట్ రెడ్డి, ఫాయాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.