బడంగ్పేట, అక్టోబర్ 14 : మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని కాలనీ అసోసియేషన్ నాయకులు శపథం చేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 51 కాలనీల అసోసియేషన్ నాయకులు బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేసి విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి అందజేశారు. సబితా ఇంద్రారెడ్డికి పూర్తిగా అండగా ఉంటామని ప్రమాణాలు చేశారు. గతంలో మురికి కూపాలుగా మారిన చెరువులను సుందరీకరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు. కాలనీల్లో ఓపెన్ జిమ్లు, వాకింగ్ట్రాక్లు, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేశారన్నారు. ఇరుకు రోడ్లను విశాలమైన రోడ్లుగా, మురుగు నీరు చెరువుల్లోకి పోకుండా ప్రత్యేక ట్రంక్లైన్ ఏర్పాటు చేశారన్నారు.
అభివృద్ధి చేశారు కనుకనే మరోసారి మహేశ్వరంలో గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమని కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు ధీమా వ్యక్తం చేశారు. చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా కన్పిస్తున్నది కనుకనే అన్ని కాలనీల అసోసియేషన్ అధ్యక్షులం ఏకగ్రీవ తీర్మానాలు చేశామని చెబుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా పనిచేసే మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని కాలనీల అసోసియేషన్ నాయకులు పేర్కొంటున్నారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, యువత, సంక్షేమ సంఘాల నాయకులు సైతం కారు సర్కారు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, యువత, సంక్షేమ సంఘాల నాయకులు సైతం కారు సర్కారు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని కాలనీ వాసులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించిన ఘనత మంత్రిదేనన్నారు. మహేశ్వరంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని కాలనీవాసులు శపథం చేస్తున్నారు.