ఆదర్శమూర్తి అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ఇచ్చింది.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంకు బండ్ వద్ద 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికే గర్వకారణంగా మారింది. సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. దళితుల అభ్యున్నతి కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ నాడు కూలీలుగా ఉన్న దళితులను ఓనర్లుగా మారుస్తున్నది. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ఆచరిస్తూ ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
తాండూరు, ఏప్రిల్ 15 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ట్యాంకు బండ్ (సాగరతీరాన) తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ స్మృతివనం, దేశంలో అతి ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం భారత దేశానికే గర్వకారణంగా మారింది. 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా 11.34 ఎకరాల విస్తీర్ణంలో రూ.146.50 కోట్ల వ్యయంతో 465 టన్నుల బరువుతో 125 అడుగల విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్వత్రా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలో ఆర్టికల్-3ను పొందుపరిచిన రాష్ట్ర బాంధవుడికి సీఎం కేసీఆర్ సమున్నత గౌరవం కల్పించడంతో తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది. అంబేద్కర్ ఏ నిమ్న వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోశారో.. ఆ వర్గాలు సమున్నత శిఖరాలను చేరుకు చేరుకునేలా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు కంకణం కట్టుకున్నారు. ‘దళితులను కూలీలుగా పనులు చేయడం కోసం మాత్రమే పరిమితం చేయొద్దు.. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్’ కల్పించండి అని నాడు బ్రిటిష్ పాలకులను అంబేద్కర్ డిమాండ్ చేశారు. 70 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో సాధ్యం కాని ఆ కలను సీఎం కేసీఆర్ తెలంగాణలో సాధించి చూపుతున్నారు.
సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి. దేశంలోనే అతి పెద్ద 125 ఫీట్ల కాంస్య విగ్రహం పెట్టడం కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనం. సీఎం కేసీఆర్ పాలనలోనే దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు. దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి ఎంతో మంది కూలీలను ఓనర్లుగా మార్చి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. ఇలాంటి నాయకుడు దేశ ప్రధాని కావాలి.
-వంకేశ్వరం భీమయ్య, దళిత సంఘం రాష్ట్ర నాయకుడు
అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం కేసీఆర్. వారికి కృతజ్ఞతలు. మహోన్నతుడు అంబేద్కర్కు సముచిత స్థానం లభించింది. పార్లమెంట్ భవనం వద్ద మహాత్మాగాంధీ విగ్రహనికి, గుజరాత్లోని నర్మదా నది తీరాన కొలువైన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ(సర్దార్ వల్లభాయ్ పటేల్) విగ్రహానికి, హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి జీవం పోసిన శిల్పి రామ్ వంజీ సుతార్కు అరుణ వందనాలు. విగ్రహం దిగువన పీఠంలో అంబేద్కర్ రచనలు, చరిత్రకు సంబంధించిన గ్రంథాలయం, అంబేద్కర్ జీవన విశేషాలు పొందుపరచబడిన ఆడియో విజువల్ రూమ్లు ఉన్నాయి. భవిష్యత్ తరాల వారికి మహోన్నతుడు అంబేద్కర్ను పరిచయం చేయాలన్న సీఎం కేసీఆర్ కృషి, నిబద్ధత ప్రస్పుటంగా కనిపిస్తున్నది.
– బుగ్గప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు
125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఆయన జీవిత చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ రూపకల్పనలో ముందుండి, దేశాభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారు.
– పామెన కమ్మరి సత్యనారాయణచారి, బీఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత
బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం. తెలంగాణ రాష్ట్రం భారత రాజ్యాంగం స్ఫూర్తితో వచ్చిందనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాడు అంబేద్కర్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకుంటే నేడు సామాన్య ప్రజలకు జీవించే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉండేది. అంబేద్కర్ భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడికీ ఓటు హక్కు ఉండాలని భావించి ఓటు హక్కును కల్పించారు. కాబట్టే నేడు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అంబేద్కర్ గొప్పతనం భావితరాల వారికి తెలియాలనే ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధునిక హంగులతో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసి అంబేద్కర్ జ్ఞాన పీఠాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఈ గొప్ప కార్యాన్ని చూసిన దళిత జాతితో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతున్నది.
– గీతావనజాక్షీ, అడ్వకేట్, మాజీ దళిత సర్పంచ్, మొయినాబాద్
అంబేద్కర్ గొప్పతనంతో పాటు ఆయన రచించిన రాజ్యాంగంపై ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కృషి మరువలేనిది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తుండటం గొప్ప విషయం. ఆయన ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలి.
– అబ్బయ్య, ప్రముఖ వైద్యుడు
సీఎం కేసీఆర్ హైదరాబాద్లో జాతి నిర్మాత, సామాజిక సంస్కర్తగా, బడుగుబలహీనుల అభ్యున్నతి కోసం కృషిచేసిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచారు. అంబేద్కర్ విగ్రహం ఒక చిహ్నం కాదు. అదో సందేశం. కుటుంబాన్ని త్యాగం చేసి మరీ అంబేద్కర్ భవిష్యత్ తరాల కోసం తాపత్రయ పడ్డారు. దేశంలో ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాతో ముందుకు వస్తున్న కేసీఆర్కు అంబేద్కర్ వాదులు సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలా దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే అంబేద్కర్ ఆశయాలతో పాలన చేస్తున్న కేసీఆర్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి.
– మెట్లి ఆశన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, తాండూరు
దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇంతటి మహత్తర కార్యాన్ని ప్రారంభించి పూర్తి చేసిన గొప్పతనం సీఎం కేసీఆర్దే. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సాగర్తీరాన 125 అడుగుల విగ్రహం ఏర్పాటు దేశానికే గర్వకారణం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలో ఆర్టికల్-3ను పొందుపరిచిన రాష్ట్ర బాంధవుడికి సీఎం కేసీఆర్ సమున్నత గౌరవం కల్పించడం అభినందనీయం. ఇలాంటి మహనీయుల బాటలో కేసీఆర్ నడవడం దేశ అభివృద్ధికి నాంది పలుకుతున్నది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో వెనుకబడ్డ కులాల వారి అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతున్నది.
– ఉప్పలి మల్కయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు, తాండూరు
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరం. ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపేందుకు అనుక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– బోసుపల్లి గణేష్, సీఈవో సహకార సంఘం
అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేయడంతో పాటు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. గత పాలకులు అంబేద్కర్ను పట్టించుకోలేదు. అటువంటిది నేడు గ్రామ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరించబడటంతో పాటు ప్రభుత్వం తరఫున అంబేద్కర్ జయంతిని నిర్వహించడం ముఖ్యమంత్రి పాలనా దక్షతకు నిదర్శనం. ఏ వర్గానికి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో అడగక ముందే ముఖ్యమంత్రి గుర్తించి సమకూర్చి ప్రతి ఒక్క వర్గాన్ని గౌరవిస్తున్నారు. సచివాలయ ప్రాంగణంలో 125 అడుల ఎత్తు విగ్రహం ప్రపంచంలోనే తలమానికంగా నిలిచింది.
– సాయిలు, చిన్ననందిగామ, కొడంగల్
దేశంలోనే ఎక్కడా లేని విధంగా నగరం నడిబొడ్డున సగర్వంగా చరిత్రలో నిలిచే విధంగా సీఎం కేసీఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ సూచకం. గతంలో పాలించిన ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించలేదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ మహోన్నత వ్యక్తి అయిన అంబేద్కర్ను గౌరవించేలా, ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించడం హర్షించదగ్గ విషయం.
– సున్నపు ప్రవీణ్, చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు
అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. దళిత జాతికే కాదు సకల ప్రజలు కేసీఆర్ ఆదర్శం. దేశ ప్రజలు కేసీఆర్ను ప్రధాని కావాలనుకుంటున్నారు.
– కట్ట యాదయ్య, సంఘసేవకుడు,నల్లచెరువు గ్రామం, మాడ్గుల
దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహా నాయకుడు సీఎం కేసీఆర్ సార్. ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది.
– అన్నేపాక మహేశ్, ఉద్యమకారుడు, మాడ్గుల గ్రామం
దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం సంతోషకరం. రాష్ట్ర ప్రభుత్వం రూ.146.5 కోట్లతో 125 అడుగుల ఎత్తులో రాష్ట్ర రాజధానిలో 11.7 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని నిర్మించింది. ఇంతటి మహత్తర కార్యాన్ని పూర్తి చేసిన గొప్పతనం మన ముఖ్యమంత్రిది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ధనిక, పేద అనే బేధం ఎక్కడా కడబడడం లేదు. అన్ని కులాలు, మతాలు, వర్ణాలకు భాషా భేదం లేకుండా అభివృద్ధి ఫలాలను అందించే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. ఒక్క ఆ గొప్పతనం రాష్ట్ర ప్రభుత్వానిదే.
– రాములు, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యాలాల
భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనాన్ని దేశం నలుమూలల చాటేందుకు కృషిచేస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశం గర్వించదగ్గ అతిపెద్ద విగ్రహాన్ని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బోడ చంద్రప్రకాశ్, రచయిత (ఇబ్రహీంపట్నం)
విశ్వమానవుడు, ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహం హైదరాబాద్లో నెలకొల్పి ఆవిష్కరించడం దేశానికే గర్వకారణం. తెలంగాణలో పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అద్భుతమైన పాలన అందిస్తూ దేశం తెలంగాణ వైపు చూసే విధంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. రాజ్యాంగ రచన చేసి దేశపాలనకు దిక్సూచిని అందించిన మహనీయుడు అంబేద్కర్ ఎత్తయిన విగ్రహాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ దళితబాంధవుడు. ఆయనకు మా కృతజ్ఞతలు.
-డప్పు శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, బొంరాస్పేట
గతంలో బడుగు బలహీన వర్గాల జీవనం అగమ్యగోచరంగా ఉండేది. అంబేద్కర్ ఆశయ సాధనతోనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి మెరుగుపడింది. అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే ఎన్నో అవమానాలు, ఇబ్బందులకు గురికావాల్సి వచ్చేది. నేడు అటువంటి పరిస్థితి లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం, సచివాలయానికి అంబేద్కర్ పేరును ప్రతిపాదించడం చరిత్రలో నిలిచిపోతుంది. మరో అంబేద్కర్గా సీఎం కేసీఆర్ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్దే ఘనత. అంబేద్కర్ జయంతిని నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– యు.రమేశ్బాబు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, కొడంగల్
అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పడం అభినందనీయం. ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని యావత్ అంబేద్కర్ అభిమానులు స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారు. నగరం నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చింది.
– తుప్పలి అశోక్కుమార్, ఉపాధ్యాయుడు కులకచర్ల