పెద్దఅంబర్పేట : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధి వైపు వెళ్లాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలు అన్నారు. ఆదివారం సుమారు రెండున్నర కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందు అరణ్య పల్లవి అపార్ట్మెంట్ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ. 23 లక్షలతో స్థానిక కౌన్సిలర్ తొండాపు రోహిణిబ్రహ్మానందరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అదే విధంగా తట్టిఅన్నారం నుంచి మరిపల్లి వరకు బీటీ నిర్మాణానికై రూ. 32లక్షలతో స్థానిక కౌన్సిలర్లు దేవిడి గీతావేణుగోపాల్రెడ్డి, పాశం అర్చనలతో కలిసి శంకుస్థాపన చేశారు.
కుంట్లూర్ వై జంక్షన్ నుంచి ఆర్జికె రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ. కోటి 95లక్షలతో చేపట్టే పనులను మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణరెడ్డి, కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కమిషనర్ ఖమర్ అహ్మద్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బ్యాంక్ డైరెక్టర్ కళ్లెం ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సిద్ధంకి కృష్ణారెడ్డి, కార్యదర్శి దామోదర్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పడమటి సుమన్రెడ్డి, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఈదమ్మల బలరాం, కంచర్ల సత్యనారాయణరెడ్డి, నాయకులు వడ్డేపల్లి విజయేందర్రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, దేవిడి విజయభాస్కర్రెడ్డి, విజయేందర్రెడ్డి, రావుల గొపాల్, మాజీ కౌన్సిలర్లు భాస్కర్గౌడ్, చెరుకూరి జగన్, మాడుగుల వెంకటేశ్, పెద్దిటి శ్రీనివాస్రెడ్డి, జోర్క రాము పాల్గొన్నారు.