పెద్దేముల్, జనవరి 4: రేగొండి గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం రేగొండి గ్రామ పంచా యతీలో తాండూరు ఆర్డీవో అశోక్ కుమార్ పరిశీలించా రు. గ్రామ పంచాయతీ పాలకమండలిలో మొత్తం 8 మంది వార్డు సభ్యులు ఉండగా అందులో ఎన్నికల ఖర్చుల వివరాలు అందించక 1, 2,5 వార్డు సభ్యులు రవి, హన్మంతు, సత్యమ్మలపై వేటు పడింది. మిగిలిన ఐదు మంది వార్డు సభ్యులలో 3,4,7,8 ల వార్డు సభ్యులు జగ్గమ్మ,అమృత,అంజిలయ్య,లలిత 6వ వార్డు సభ్యుడు ఉపసర్పంచ్ శివకుమార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతూ ఆర్డీవో అశోక్కుమార్ తెలియజేశారు.
మెజార్టీ వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని బలపరచడంతో నివేదికను పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్, డీపీవోలకు పంపనున్నట్లు ఆర్డీవో తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్వో విద్యాసాగర్ రెడ్డి, ఎంపీడీవో లక్ష్మప్ప, ఆర్ఐ రాజురెడ్డి, రేగొండి సర్పంచ్ హైదర్, పంచాయతీ కార్యదర్శి జమీల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.