మొయినాబాద్, సెప్టెంబర్19: చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొయినాబాద్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు. చేవెళ్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి మొయినాబాద్కు బయలుదేరారు. చేవెళ్లలోని షాబాద్ చౌరస్తాలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంపీ రంజిత్రెడ్డిని భారీ గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మొయినాబాద్ మండల కేంద్రానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఎంపీపీ నక్షత్రంజయవంత్, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ల ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఎంపీని సన్మానించారు. అనంతరం ఎన్కేపల్లి గ్రామంలోని క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడకల్లో పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో టీటీడీ బోర్డు సభ్యులు గడ్డం సీతారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఎంపీని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్కేపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాము, పార్టీ నాయకులతో కలిసి రక్తదాన శిబిరం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో టీటీడీ బోర్డు సభ్యులు, సతీమణి సీతారెడ్డితో కలిసి మొక్కలు నాటారు.