షాద్నగర్ : యాదవుల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా షాద్నగర్ పట్టణంలో శనివారం రాత్రి అఖిల భారత యాదవ సంఘం నాయకులు ఘనంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి పట్టణ పురవీదుల్లో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలువురు యాదవ సంఘం నాయకులు డీజే నృత్యాలతో దున్నపోతులను ఆడిస్తు యాదవ సంస్కృతిని చాటారు. ఇందులో భాగంగానే పట్టణంలోని ప్రధాన దారిలో ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవ వేదిక వద్ద స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్, యాదవ సంఘం నాయకులు రఘునాథ్యాదవ్, చీపిరి రవియాదవ్, దేవేందర్యాదవ్లు దున్నపోతులకు స్వాగతం పలుకుతు దున్నలతో నృత్యం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదవుల సంస్కృతి, సంప్రదాయాలను నేటితరం చిన్నారులకు పరిచయం చేయాలని కోరారు. శ్రీకృష్ణుని వారసులుగా పేరొందిన యాదవులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. సేవే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఘనంగా సదర్ ఉత్సవాలను నిర్వహించడం సంతోషకరమని కొనియాడారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు, యాదవ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.