మంచాల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయ నాన్టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బియ్యని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జాపాల టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యేను పూలమాలలు, శాల్వాతో సన్మాణించి ఆయనకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేను సన్మాణించిన వారిలో టీఆర్ఎస్ నాయకులు చీరాల రమేశ్, బకున సోమేశ్వర్, బియ్యని సతీశ్, ఒట్టి జంగయ్య, నోముల కుమార్, ఓరుగంటి బాల్రాజ్, హనుమండ్ల సంజీవ, యాట భిక్షపతి, నోముల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.