షాద్నగర్ : కుటుంబ పెద్ద మృతి చెందారని ఆందోళన చెందొద్దని, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మృతి చెందిన కూలీల కుటుంబాలకు భరోసా కల్పించారు. ఇటివలే షాద్నగర్ మున్సిపాలిటీలోని చటాన్పల్లి వద్ద మట్టి దిబ్బలు కూలి దినసరి కూలీలు శ్రీనివాస్, కృష్ణయ్యలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఫరూఖ్నగర్ మండలం ఉప్పరిగడ్డ తండాలోని వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ఒక్కొ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు కుటుంబ పెద్దలను కోల్పోవడం బాధకరమని, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
మీ పిల్లలను ఉన్నత చదువులను చదివించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సైతం అండగా ఉంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఇన్చార్జి కమిషనర్ ఆహ్మద్ షఫీ ఉల్లా, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాల్నాయక్, మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, గ్రామాల సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాల్గొన్నారు.