యాచారం : మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో వెంకట్రెడ్డి అనే రైతు పొలంలో ఉన్న బోరు నుంచి పాతాల గంగా ఉబికి వస్తుంది. నెల రోజులుగా నీరు పుష్కలంగా రావడంతో రైతు బోరు ఆన్ చేయకుండానే నీరు పొలానికి మళ్లిస్తున్నాడు. ఇటీవల మండలంలో విస్తారంగా వర్షాలు కురువడంతో చెరువు కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు గత పదేళ్లతో పోలిస్తే విపరీతంగా పెరిగాయి.
వెంకట్రెడ్డి పొలంలో బోరు నుంచి అమాంతం నీరు పైకి రావడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఐదారేళ్లు సాగునీటికి డోకా లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు.