యాచారం : టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, నందివనపర్తి మాజీ సర్పంచ్ రాజునాయక్లు ఆదివారం ఎమ్మెల్యేను కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో పార్టీ స్థితిగతులపై ఆయన నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్ట పరచాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.