మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలుపే లక్ష్యంగా మన జిల్లా ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. మంత్రి సబితారెడ్డితోపాటు ఎమ్మెల్యేలకు పలు యూనిట్లను అప్పగించగా స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటికెళ్లి తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎమ్మెల్యేగా రాజగోపాల్రెడ్డి మునుగోడుకు చేసింది శూన్యమన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నల్లగొండ నుంచి ఫ్లోరైడ్ రక్కసిని పారదోలారని, కారు గుర్తుకు ఓటేసి కృతజ్ఞతను చాటాలని కోరుతున్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ గెలుపే లక్ష్యం గా మంత్రులు, ఎమ్మెల్యేలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధి-సంక్షేమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లేలా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్తోపాటు మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే మునుగోడుకు చేరుకున్నారు. గ్రేటర్ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డితోపాటు ఈ నాలుగు జిల్లాలో పరిధిలో ని ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ పలు యూనిట్ల బాధ్యతలను అప్పగించారు.
కొదాస్పల్లిలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, నాయకులు
ముమ్మరంగా ప్రచారం..
నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారా మోగిన నేపథ్యంలో గులాబీదళం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలోని ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరుకూ వివరించేలా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రచార వ్యూహాన్ని రూ పొందించింది. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతంతో ఇరవైలోనే అరవై ఏండ్ల ఛాయలతో కునారిల్లిన జనానికి మిషన్ భగీరథ నీరు సంజీవనీలా మారిన విధానాన్ని ప్రపంచం మొత్తం చూసింది. మరోవైపు రాజకీయాలకు అతీతంగా అర్హుడైన ప్రతి ఒక్క రూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందుతున్న వాస్తవాలు కూడా నియోజకవర్గ ప్రజల మదిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఉప ఎన్నిక నేపథ్యం లో ఇంటింటికీ ఈ అంశాలను మరోసారి తీసుకెళ్లి ఓటర్లను చైతన్యం చేసేందుకు పార్టీ అధిష్ఠా నం ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించిం ది. ఇందులో ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులకూ ఒకొక్కరికీ ఒక ఎంపీటీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) పరిధి గానీ రెండు వార్డులను గానీ ఒక యూనిట్గా పరిగణించి ప్రచార బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. వచ్చే నెల మూడో తేదీన పోలిం గ్ జరుగనుండటంతో ప్రచారం ముగిసే వరకు వీరంతా క్షేత్రస్థాయిలోనే ఉండి తమ పరిధుల్లోని ఓటర్లను కలువడంతోపాటు స్థానిక టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తల్ని సమన్వయం చేసుకోనున్నారు.