తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమ్మగూడ లక్ష్మీనగర్ కాలనీలోని శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో బుధవారం సీతారామ విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోకంగా సీతారాముల విగ్రహా ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగా జరిగాయి. ఆలయ పరిసరాలు శ్రీరామ నామస్మరణతో మారుమోగాయి. ఈ నెల 21నుంచి ప్రారంభమైన విగ్రహా ప్రతిష్టాపనోత్సవాలు బుధవారంతో ముగిశాయి.
సీతారాముల విగ్రహా ప్రతిష్టాపనోత్సవానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీందర్నాయక్, ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్, ఆదాయపు పన్నును అదనపు కమిషనర్ జీవన్లాల్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కందాడ ముత్యంరెడ్డి, తుర్కయాంజల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధరాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధన్రాజ్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పంచముఖ ఆంజనేయస్వామితో పాటు సీతారాముల విగ్రహా మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు పలువురి నాయకులను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. భక్తులు, ప్రజలు గురుస్వాములు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల విగ్రహా ప్రతిష్టాపనోత్సవాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కొశిక ఐలయ్య, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రమావత్ కల్యాణ్ నాయక్ రంగారెడ్డి జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామి, మాజీ ఎంపీపీ మల్రెడ్డి రాంరెడ్డి, నాయకులు నోముల దయానంద్ గౌడ్, వద్దగోని అజయ్ గౌడ్, మోహన్ నాయక్, రాగ్యా నాయక్, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.