షాద్నగర్ : కొవిడ్ కారణంగా అనాథాలుగా మారిన చిన్నారులకు సర్కారు అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. మంగళవారం చైల్డ్రైట్స్ వీక్ సందర్భంగా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తన కార్యాలయంలో పలువురు చిన్నారులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొవిడ్ కారణంగా చిన్నారులు తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం చాలా బాధకరమని, చిన్నారుల భాగోగులను సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు.
చదువుల్లో రాణించి సమాజంలో నిలబడాలని కోరారు. చిన్నారులు ఉంటున్న నివాసాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ హర్షవర్ధిని, బాలల సంరక్షన అధికారి ప్రవీణ్కుమార్, అధికారులు పాల్గొన్నారు.