నందిగామ : ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన శ్రీనుకు రూ. 60,000, స్రవంతికి రూ. 60,000, సురేశ్కు రూ.60,000 సీఎం సహాయనిధి ద్వారా మంజురైన చెక్కులను శనివారం ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం నిరుపేదల అభ్యున్నతికేనన్నారు. కార్యక్రమంలో చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, నాయకులు జెట్ట రమేశ్, మధు, నరేందర్, శ్రీను పాల్గొన్నారు.