ఇబ్రహీంపట్నంరూరల్ : అన్నదాతల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామానికి చెందిన రైతులు జంగయ్య, జక్కుల ఆంజనేయులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రైతుబీమా కింద రూ. 5లక్షల చొప్పున ఇద్దరికి రూ. 10లక్షలు మంజూరయ్యాయి. అట్టి ఎల్ఓసీలను బుధవారం ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబీమా పథకం కింద పేద రైతు కుటుంబాలను ఆదుకుంటుందన్నారు.
ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వం రైతు బీమా కింద రూ. 5లక్షలు అందజేసి ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, సర్పంచ్ చిలుకల యాదగిరి, ఎంపీటీసీ నాగటి నాగమణి, మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, నియోజకవర్గ తెరాస యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు, వార్డు సభ్యులు కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు యాదగిరి, వీరయ్య, వెంకటేశ్, మహేందర్, బాష, రవి, వెంకటేష్ ఉన్నారు.