నందిగామ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం నందిగామ మండల పరిధిలోని నర్సప్పగూడ గ్రామంలోని అక్కమ్మ చెరువులో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందిస్తున్న చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి అక్కమ్మ చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని కులల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలు చేపడుతుందన్నారు. అందులో భాగంగానే మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూడిక అభివృద్ధి చేస్తున్నమని, దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా చేపపిల్లను పంపిణీ చేస్తున్నమన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రథమస్థానంలో నడిపిస్తూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్దే అన్నారు. ప్రజలు ఊహించని పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. చేప పిల్లలను ఉచితంగా అందజేసి ముదిరాజ్లను, బెస్తల కుటుంబాలను జీవనోపాధిని కల్పిస్తుందని ఆసక్తిగలవారు ముందుకొచ్చి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా ఏడీ సుకీర్తి, నర్సప్పగూడ సర్పంచ్ గోవిందు అశోక్, ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ కళమ్మ, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు జంగిలి కుమార్, కట్న శ్రీశైలం, యాదగిరిగౌడ్, నర్సింహులు, శ్రీకాంత్గౌడ్, మల్లేశ్, మత్స్య సహకారం సంఘం గ్రామ అధ్యక్షుడు నీరటి నర్సింహా, కార్యదర్శి చందన్, సిద్ధులు, రాజేందర్, రాములు, అర్జునయ్య పాల్గొన్నారు.