కేశంపేట : కేశంపేట మండలం కొత్తపేట, నిర్దవెళ్లిలలో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పారిశుధ్య పనులను సెంట్రల్ టీం సభ్యులు సర్వే నిర్వహించారు. కొత్తపేటలో పారిశుధ్య పనులను సెంట్రల్ టీంతో పాటు రంగారెడ్డి అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్ కూడా పరిశీలించారు. గ్రామాల్లో టీం సభ్యులు పారిశుధ్యం, రోడ్లకు ఇరుపక్కల హరితహారం మొక్కల పెంపకం, వ్యక్తిగత మరుగుదొడ్లు వాడకంపై పరిశీలించారు. ఈ కార్యక్రమంపై గ్రామాలకు వచ్చిన జాయింట్ కలెక్టర్, సెంట్రల్ టీం సభ్యులను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సాదరంగా ఆహ్వానం పలికారు. సాయంత్రం వరకు సెంట్రల్ టీం సభ్యులు గ్రామాల్లో సర్వే నిర్వహించి వెళ్లారు.
ఈ కార్యక్రమాల్లో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, డీఆర్డీఏ పీడీ సుధాకర్, డీపీఓ శ్రీనివాస్రెడ్డి, సెంట్రల్ టీం డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ శివప్రసాద్, ఇన్ఫోస్పెక్షన్ ఆఫీసర్ అశోక్రెడ్డి, శ్రవణ్, స్వచ్ఛభారత్ మిషన్ రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ రోజా, ఆయా గ్రామాల సర్పంచ్లు, మండల కో- ఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.