అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని గుంతపల్లిలో నూతనంగా నిర్మించిన సీతరామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభం, నవగ్రహా ధ్వజ ప్రతిష్ఠ, సర్పంచ్ కరిమెల వెంకటేష్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ దంపతులు స్వామికి పట్టువస్త్రాలను సమర్పించి భక్త జన సందోహం నడుమ స్వామి వారి కల్యాణం కన్నుల పండువగా జరిపించారు. వేడుకలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, ఎంపీపీ బుర రేఖమహేందర్గౌడ్, జడ్పీటీసీ బింగి దాసుగౌడ్, వైస్ఎంపీపీ కొలన్ శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీ మేడిపల్లి బాలమ్మ, బాటసింగారం సహకార బ్యాంక్ చైర్మెన్ లెక్కల విఠల్రెడ్డి, ఉపసర్పంచ్ ఫాతిమాఅప్సర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, ప్రధాన కార్యదర్శి కోట వెంకట్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్ని తీర్థప్రసాదలను స్వీకరించారు. కార్యక్రమంలో పలు గ్రామల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.