కడ్తాల్ : వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు మంగళవారం కడ్తాల్ మండల కేంద్రానికి విచ్ఛేసిన మంత్రి సబితారెడ్డికి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డికి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పాగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన, జూనియర్ కళాశాల, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ, పలువురు నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.