మోమిన్పేట : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మొరంగపల్లిలో బృహత్ ప్రకృతి వనం, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, వెల్చాల్, మోమిన్పేటలో ప్రకృతి వనలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహత్ ప్రకృతి వనం పనులను వేగవంతం చేసి మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టలన్నారు. వనం చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పల్లెప్రకృతి వనంలో మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయని కితాబిచ్చారు.
ఇదే విధంగా పనులను కొనసాగించాలని సర్పంచులకు, కార్యదర్శులకు సూచించారు. గ్రామాల్లో 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, వ్యాక్సిన్ అందరూ తీసుకునే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, అవగాహన కల్పించాలన్నారు. మండలంలో మొత్తం 9వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజారెడ్డి, ఏపీవో శంకర్, సర్పంచ్ అంగెరి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నర్సింహులు, నీరంజన్రెడ్డి, ఈసీ వికాస్ పాల్గొన్నారు.