పరిగి : సుల్తాన్పూర్ స్టేజీ నుంచి కోటి 33లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు సైతం ప్రారంభం అవుతాయని, సాధ్యమైనంత త్వరగా ఈ రోడ్డు నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వారం రోజుల్లోపు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.