బొంరాస్పేట : కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని మూత్ర పిండాల రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే మహబూబ్నగర్, హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తుందని, పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలోని ఐదు మండలాల రోగులకు ఎంతో మేలు కలుగుతుందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే వినతికి మంత్రి హరీశ్రావు సానుకూలంగా స్పందించి డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అదే విధంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను కూడా ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట బొంరాస్పేట మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా, కోస్గి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, భీంరెడ్డి, మద్దూరు మండల నాయకుడు బాల్సింగ్ నాయక్ ఉన్నారు.