వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలో పర్యటించాలని కోరడంతో సీఎం కేసీఆర్ త్వరలో పర్యటిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతన బ్రిడ్జీ నిర్మాణం, మర్పల్లి మండల కేంద్రంలోని మెయిన్రోడ్, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిధులు మంజూరుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు.