మంచాల : సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోనని ఎల్లమ్మతండా గ్రామానికి చెందిన సపావట్ నాను, సపావట్ శ్రీధర్ అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైద్య ఖుర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒక్కోక్కరికి రూ. 60వేల చొప్పున మంజూరయ్యాయి. అట్టి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.