ఇబ్రహీంపట్నం : సైబర్నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదిబట్ల సీఐ నరేందర్, షీటీం ఎస్సై శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని ఎంపీపటేల్గూడ ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహనతో పాటు సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ కాంగ్రెస్ అంబాసిడర్లుగా నియమితులైన అఖిల, శివ, సల్మాన్లకు బ్యాడ్జిలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో 50 పాఠశాలలు సైబర్ కాంగ్రెస్ ఎంపికయ్యాయని చెప్పారు. అందులో ఎంపీ పటేల్గూడ ఉన్నత పాఠశాలను కూడా ఎంపిక చేశారన్నారు. జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభమైందని అప్పటి నుంచి సైబర్ నేరాలను అరికట్టడానికి రోజుకో పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు షీటీమ్ ఎస్సై శ్రీనివాసులు, హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు.
రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ముందు చూపుతో ఉండాలన్నారు. ఎంపీపటేల్గూడ పాఠశాలను సైబర్ కాంగ్రెస్ ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయమని, మా పాఠశాలను ఎంపిక చేసినందుకు డీఈఓ, పోలీసుశాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.