శంకర్పల్లి : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల సభ్యులు పార్టీ ప్రతిష్ట కోసం అనునిత్యం పాటు పడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం శంకర్పల్లి మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వాసుదేవ్కన్నా, యువత అధ్యక్షుడు పాండురంగారెడ్డిలు మంత్రి సబితాఇంద్రారెడ్డిని తన స్వగృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు.
అలాగే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ చంద్రమౌళి, శంకర్పల్లి మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.