మోమిన్పేట : మండల పరిధిలోని టేకులపల్లి సర్పంచ్ నవనీతరెడ్డి, మోమిన్పేట పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి దంపతుల కుమారులు అనురూత్రెడ్డి, అశ్విత్రెడ్డిల డోలారోహన కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గోని చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో వారితో పాటు జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీ వసంత, మండల అధ్యక్షుడు వెంకట్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ నర్సింలు గుప్తా, మాజీ మండల అధ్యక్షుడు నర్సిపంహ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.