తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ రాగన్నగూడ పరిధిలోని శ్రీరంగపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాత మంటపంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం నిర్వహించిన అమ్మవారి పూజలో ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కందాడ ముత్యంరెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ సామ సంజీవరెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై అమ్మవారికి పూజలు చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సామ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు బుచ్చిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, హరికృష్ణారెడ్డి, రవీందర్ రావు, సామ ప్రభాకర్ రెడ్డి, సామ కిట్టు, సామ బాలు, జొన్నాడ సుదర్శన్ రెడ్డి, కందాడ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.