చేవెళ్ల టౌన్ : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి గాయాలైన సంఘటన చేవెళ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల గ్రామానికి చెందిన వడ్డె మల్లేశ్ జెండా రాడ్ తీస్తుండగా బ్యాలెన్స్ తప్పి కరెంటు తీగల మీద పడటంతో విద్యుత్ షాక్ తగిలి తీవ్రగాయాలు కాగా తృటిలో ప్రాణాపాయం తప్పింది. జెండా రాడు విద్యుత్ తీగలపైన పడటంతో కొబ్బరి బొండాల బండి, పూల బండికి షాక్ రావటంతో పాటు మంటలు చెలరేగాయి.
దీంతో అతన్ని వెంటనే చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.