షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకార్మికుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో కార్మికులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులకు కనీస గుర్తింపు ఉండేది కాదని, సీఎం కేసీఆర్ పాలనలో కార్మికులకు ప్రత్యేక గుర్తింతో పాటు ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ స్వరాష్ర్టంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువును మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి మత్స్యకార్మికుల కు ఉపాధి చూపారన్నారు.
చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కంసాన్పల్లి, లింగారెడ్డిగూడ గ్రామాల మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, ఎంపీడీవో శరత్చంద్ర బాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, కౌన్సిలర్ ప్రతాప్రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.