మొయినాబాద్ : పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆర్థికంగా ఆదుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులు 57మందికి ఎంపీపీ గునుగుర్తి నక్షత్రంతో కలిసి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని చెప్పారు. ప్రతి ఇంటికి రెండు నుంచి మూడు ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధంగా సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టలేదన్నారు.
పేద కుంటుంబంలో ఆడపిల్ల పెళ్లి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష116లు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, తాసిల్దార్ అనిత, ఎంపీడీవో విజయలక్ష్మి, డీటీ ఎండీ తాజూద్దీన్, ఆర్ఐలు చంద్రమౌళి, పాండు, సర్పంచ్లు మనోజ్కుమార్, శ్రీనివాస్, రత్నం, ఎంపీటీసీ మల్లేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింహరెడ్డి, వెంకట్రెడ్డి, జయవంత్, హరిశంకర్గౌడ్ పాల్గొన్నారు.