షాబాద్ : కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నడని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయా గ్రామాలకు చెందిన 44మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నరని పేర్కొన్నారు.
ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ, డిప్యూటీ తాసిల్దార్ క్రాంతికుమార్, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, సర్పంచులు, నాయకులు తదితరులు ఉన్నారు.
ఎంపీడీవో కార్యాలయాన్ని తనీఖీ చేసిన ఎమ్మెల్యే
షాబాద్ ఎంపీడీవో కార్యాలయాన్ని ఎమ్మెల్యే జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.