ఇబ్రహీంపట్నం : మరో ఇరవైఏండ్ల వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలం మల్కీజ్గూడ గ్రామానికి చెందిన పలుపార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో అబ్బయ్య, కృష్ణారెడ్డి, అచ్చన శ్రీశైలం, అనంత్రెడ్డి, రామకృష్ణ, మల్లేష్, లింగారెడ్డి, కృష్ణయ్య, పాండు, శ్రీశైలం పాల్గొన్నారు.