షాబాద్ : సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపడుతున్న కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట్ 13వ వార్డు కార్పొరేటర్ నరేంద్రకుమార్ బీజేపీకి రాజీనామా చేసి మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను మంత్రి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలే టీఆర్ఎస్ విజయ సోపానాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి అందరి చూపు టీఆర్ఎస్ వైపు మళ్లీందని చెప్పారు.
తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలందరి ఇంటి పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి, అందరికంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న సీఎం కేసీఆర్ పాలనను చూసి చాలామంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరటానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు.
డివిజన్ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ మంత్రి సబితారెడ్డి అనునిత్యం ప్రజల్లో ఉంటూ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు పార్టీ తీర్థం పుచ్చుకున్న నరేంద్రకుమార్ తెలిపారు.