చేవెళ్ల టౌన్ : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసి కిస్మస్ పండుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యకమంలో చేవెళ్ల, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు మర్పల్లి మాలతి, సర్పంచ్ బండారి శైలజ అగిరెడ్డి, తాసిల్దార్ అశోక్ కుమార్, సర్పంచులు మల్లారెడ్డి, శివరెడ్డి, ప్రభాకర్, జహంగీర్, శంకర్, నాయకులు నాగార్జన రెడ్డి, సాయినాత్ లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.